Sunday, March 24, 2024

భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీలను ఆవిష్కరించిన‌ అడిడాస్ ఇండియా, బీసీసీఐ..

గ్లోబల్ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ అడిడాస్ లండన్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మెన్ ఇన్ బ్లూ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కోసం కొత్త జెర్సీలను విడుదల చేసింది. ఈ జర్మన్ స్పోర్ట్స్‌వేర్ కంపెనీ BCCIతో ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ సెట్ చేసుకుంది. దీని విలువ దాదాపు INR 350 కోట్లు ఉంటుంది. ఈ కొత్త ఒప్పందంలో భాగంగా.. పురుషుల, మహిళల జట్లతో సహా అన్ని భారతీయ జట్లకు అడిడాస్ దుస్తులను సరఫరా చేస్తుంది.

అడిడాస్ రిలీజ్ చేసిన‌ కొత్త భారతీయుల జెర్సీలు ఎలా ఉన్న‌యి అంటే..

టెస్ట్ జెర్సీలు నీలిరంగు ఫాంట్‌ షేడ్స్‌తో క‌నిపిస్తున్నాయి. ODI జెర్సీ భుజాలపై తెల్లటి మూడు చారలతో క్లాసిక్ బ్లూ క‌ల‌ర్ తో ఉంది. ఇక‌ T20I జెర్సీ కాలర్ లేకుండా కొద్దిగా డార్క్ బ్లూ క‌ల‌ర్ తో భుజాలపై అదే తెల్లని చారలను కలిగి ఉంటుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement