Friday, March 29, 2024

తొలి రోజే పార్లమెంట్ లో ‘అదాని’ హాట్ హాట్ – రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు నేటి దయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి.. రెండు సభలలోనూ విపక్షాలు అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్‌ కమిటీ వేయాలని పట్టుబట్టాయి. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేక ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దాంతో పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఈ ప‌రిస్థితుల‌లోబిజెపి స‌భ్యులు ఎదురుదాడికి దిగారు.. లండన్‌లో చేసిన వ్యాఖ్యలకుగానీ రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కేంద్ర మంత్రులు, ఎంపీలు రాహుల్‌గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ ఆందోళనకు దిగారు. ఈ పరిణామాలు మధ్య పార్లమెంటు ఉభయసభలు ముందుగా మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత సభలు ప్రారంభమైనప్పటికీ మళ్లీ అదే పరిస్థితి రిపీట్‌ అయ్యింది. దాంతో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement