Saturday, March 23, 2024

వెన్నెముక స‌మ‌స్య‌తో ఆసుప‌త్రిలో చేరిన -న‌టి ఖుష్భూ

వెన్నెముక స‌మ‌స్య‌తో ఆసుప‌త్రిలో చేరారు న‌టి..ఖుష్భూ. ఇప్పుడే ఇంటికి వచ్చాను.. ఒకటి రెండు రోజుల్లో కోలుకొని మళ్ళీ.. రోజూ వారి విధుల్లో పాలుపంచుకుంటానని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆస్ప‌త్రిలో బెడ్ పై ఉన్న ఫొటోని పోస్ట్ చేశారు. లేటుగా ద‌స‌రా శుభాకాంక్షలు తెలుపుతున్నందుకు క్షమించండి.. అందరికీ దసరా శుభాకాంక్షలు అని ట్వీట్ చేసింది. అంతేకాదు ఆమె ఆసుపత్రి బెడ్ మీద ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. ఇకపోతే రెండు రోజుల వరకు ఆరోగ్యంగా ఉన్న ఖుష్బూ మంగళవారం కూడా తన సోదరుడు అబ్దుల్లా నటించిన సినిమా ఆడియో రిలీజ్ వేడుకలలో కూడా పాల్గొనింది. సాయంత్రానికి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ క్రమంలోనే నగరంలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కుదుటపడి.. డిస్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు.. ఇకపోతే ఈమె ట్వీట్ చేయగానే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోండి.. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement