Wednesday, April 24, 2024

చిక్కుల్లో న‌టి చాహ‌త్ ఖ‌న్నా.. రూ.వంద కోట్ల లీగ‌ల్ నోటీసు పంపిన సుకేశ్‌

రూ.200కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డిన సుఖేష్ ను జైల్లో క‌లిసిన కార‌ణంగా టీవీ న‌టి చాహ‌త్ ఖ‌న్నాకి కూడా స‌మ‌న్లు పంపారు.
నటి చాహత్ ఖన్నాకు సుఖేష్ .. రూ.100 కోట్ల లీగల్ నోటీసు పంపారు.ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో నటి చాహత్ .. తనపై తప్పుడు సమాచారం చేసిందనీ, తన సామాజిక ప్రతిష్టను దెబ్బ తీసేలా.. తీవ్ర ఆరోపణలు చేసిందని , రూ.100 కోట్ల లీగల్ నోటీసు పంపారు.మా క్లయింట్ సుకేష్ చంద్రశేఖర్ తరపున మేం మీకు ఈ నోటీసు పంపుతున్నాం అని నోటీసులో తెలిపారు. అవమానకరమైన ప్రకటనలు చేసినందుకు, చాహత్ ఖన్నా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, 100 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కోరారు. నటి ప్రకటనతో సుకేష్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, అలాగే మానసికంగా బాధపడ్డానని నోటీసులో పేర్కొన్నారు.

కాగా జనవరి 29న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో చాహత్ ఖన్నా మాట్లాడుతూ.. తనని ట్రాప్ చేసి తీహార్ జైలుకు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ పిలిపించుకున్నాడని వెల్లడించింది. ఆ సమయంలో సుఖేష్ తాను దివంగత జయలలిత మేనల్లుడిని, ఒక ప్రముఖ దక్షిణ భారత టీవీ ఛానెల్ యజమానిని కలుస్తున్నానని అనుకున్నానని చాహత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకి పెద్ద అభిమానిని అని, తన టీవీ షో బడే అచ్చే లాగ్తే హైని రెగ్యూలర్ గా చూశానన్నాడని తెలిపాడనీ, తనని కలవాలనుకుంటున్నానని చెప్పాడని తెలిపింది. ఆ సమయంలో సుకేష్ మోకాళ్లపై కూర్చోని పెళ్లి ప్రపోజ్ చేశాడని సంచలన ప్రకటన చేసింది. నటి చాహత్ వాదనను సుఖేష్ కొట్టిపారేశారు. ఆమెను ప్రపోజ్ చేశాననే వాదనను ఖండించాడు. ఈ క్రమంలో సుకేష్ .. నటికి లీగల్ నోటీసు పంపాడు. అవమానకరమైన ప్రకటనలు చేసినందుకు.. చాహత్ ఖన్నా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రూ. 100 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement