Friday, March 29, 2024

గోపీచంద్ మూవీలో ‘కుష్బూ’

త‌మిళ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు సీనియ‌ర్ న‌టి కుష్బూ. అందుకే తెలుగులో ఆమె ఎక్కువ సినిమాల్లో న‌టించ‌లేక‌పోతోంది.
స్టాలిన్’ సినిమాతో కేరక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తరువాత ‘యమదొంగ’ .. ‘అజ్ఞాతవాసి’ సినిమాలలో కీలకమైన పాత్రలను పోషించింది. ‘అజ్ఞాతవాసి’ నుంచి ఆమె తెలుగు సినిమాలపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలోను ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవాస్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయడానికి ఆమె అంగీకరించింది. గోపీచంద్ హీరోగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. షూటింగుకి వెల్ కమ్ చెబుతూ ఈ సినిమా టీమ్ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలింది. విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా కెరియర్ పరంగా గోపీచంద్ కి 30 సినిమా కావడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement