Friday, April 19, 2024

హైదరాబాద్‌లో 45 నిమిషాల పాటు ఉచిత వైఫై

హైదరాబాద్‌లో పనిమీద బయటకు వచ్చిన మొబైల్ వినియోగదారులు ఇకపై 45 నిమిషాల పాటు ఉచితంగా వైఫైని ఉపయోగించుకోవచ్చు. తాజాగా ఈ సౌకర్యం మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని 3 వేల రద్దీ ప్రాంతాల్లో ప్రభుత్వ సహకారంతో యాక్ట్ ఫైబర్ నెట్ ఉచిత వైఫై సౌకర్యాన్ని అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఉచిత వైఫై సౌకర్యాన్ని మంత్రి కేటీఆర్ బుధవారం సాయంత్రం లాంఛనంగా దీనిని ప్రారంభించారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ ఈ సేవలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే తాను అన్న ఒకే ఒక్క మాటతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారంటూ యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాదికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇదే అతిపెద్ద పబ్లిక్ వైఫై అని పేర్కొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ఓపెన్ వైఫైని నెలకు 3 లక్షల మంది వరకు వినియోగించుకుంటున్నట్టు యాక్ట్ ఫైబర్ నెట్ సీఈవో బాల మల్లాది చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి: సికింద్రాబాద్‌లో రోడ్డుప్రమాదం.. యువకుడు మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement