Thursday, April 25, 2024

వైరల్ అవుతోన్న ..రేణుదేశాయ్ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుండి విడిపోయాక నటి రేణుదేశాయ్ తన పిల్లలతో కలిసి పూణేలో ఉంటున్నారు. 2013లో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకులు పొందారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కి పర్సనల్ లైఫ్ పెద్ద ఇబ్బందిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శించాలి అంటే ప్రత్యర్థులు ముందుగా మూడు పెళ్లిళ్ల ప్రస్తావనే తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు సహనంతో వ్యవహరించిన పవన్ ఇటీవల జనసేన పార్టీ కార్యక్రమంలో అవుట్ బరస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే చెప్పులతో కొడతా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వర్గాల్లో పవన్ కామెంట్స్ పెను ప్రకంపనలు రేపాయి. ఇదే మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తన సినిమాల సంపాదన, విడాకులు తీసుకోవడం గురించి ఓపెన్ అయ్యారు. విడాకులు తీసుకున్నందుకు మొదటి భార్యకి రూ.5 కోట్లు.. రెండవ భార్యకి ఆస్తిలో కొంత భాగం ఇచ్చినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విడిపోయే సమయంలో తాను ఎలాంటి భరణం తీసుకోలేదని రేణు దేశాయ్ పేర్కొన్నారు. ఇప్పుడు పవన్ మరో రకంగా కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇలాంటి తరుణంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. రేణు దేశాయ్ ఆ పోస్ట్ ఏ ఉద్దేశంతో చేసిందో తెలియదు కానీ.. నెటిజన్లు మాత్రం వైరల్ చేస్తున్నారు. నీ వర్షన్ కాదు, నా వర్షన్ కాదు.. నిజం అనేది ఒకటి ఉంటుంది. నిజం శాశ్వతంగా ఉంటుంది అనేది నేను జీవితంలో నేర్చుకున్న అంశం అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ మాటల్లో ఆంతర్యం అర్థం కాక నెటిజన్లు తికమక పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement