Tuesday, March 26, 2024

50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ను సాధించిన.. అహ నా పెళ్లంట

జీ5లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అహ నా పెళ్లంట. ఈ చిత్రంలో రాజ్ తరుణ్..శివానీ రాజశేఖర్ నటించారు. ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాహుల్ తమడ నిర్మాతగా వ్యవహరించారు.కాగా ఈ చిత్రం 50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ను సాధించింది. అంతేకాదు ఐఎండీబీ ప్రకటించిన టాప్ 10 ప్రేక్షకాదరణ పొందిన వెబ్ సిరీస్ ల లిస్ట్ లో కూడా చోటు దక్కించుకుంది. ఈ చిత్రంలో రాజ్ తరుణ్, శివానీల మధ్య కెమిస్ట్రీ హైలైట్ అని అందరూ అంటున్నారు. చక్కటి కామెడీతో కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమ‌ని, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, గెట‌ప్ శీను, జ‌బ‌ర్ద‌స్త్ రాజ‌మౌళి, తాగుబోతు ర‌మేష్‌, మ‌ధునంద‌న్‌, భద్ర‌మ్‌, ర‌ఘు కారుమంచి, దొర‌బాబు త‌దిత‌రులు ప్రధాన పాత్రలను పోషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement