Thursday, April 18, 2024

AP | ఏసీబీ ట్రాప్‌.. న‌గ‌దు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్ఐ

ప్ర‌కాశం జిల్లాలో ఏసీబీ వ‌ల ప‌న్నింది. ఎస్సీ ఎస్టీ కేసులో లంచం ఇవ్వ‌నిదే ప‌ని కానివ్వ‌నంటూ ఇబ్బంది పెడుతున్న ఓ ఎస్సైపై ఫిర్యాదు రావ‌డంతో ట్రాప్ చేసింది. కాగా, ఇవ్వాల (బుధ‌వారం) రూ. 20వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు కొండేపి ఎస్సై రామకృష్ణ. అతనితోపాటు కానిస్టేబుల్ గోగుల కోటేశ్వరరావు కూడా దీనిలో ఇన్‌వాల్వ్ అయ్యారు. బుధవారం సాయంత్రం పథకం ప్రకారం ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఎస్ఐని రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement