Tuesday, April 16, 2024

అసెంబ్లీ వద్ద రచ్చ

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలంటూ ఏబీవీబీ విద్యార్ధులు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏబీవీబీ విద్యార్థులు డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పెంచిన పదవీ విరమణ వయసును తగ్గించాలని నినాదాలు చేశారు. అయితే, ఏబీవీపీ విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఏబీవీపీ విద్యార్థుల ముట్టడితో కొద్దిసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. TSPSC ఉద్యోగ నోటిఫికేషన్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బారీకేడ్లను తొలగించుకొని ఏబీవీపీ కార్యకర్తలు అసెంబ్లీ వైపు దూసూకొచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తోపులాటలో ఏబీవీపీ కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement