Wednesday, April 17, 2024

దేశంలో 15 వందలకు దిగొచ్చిన కరోనాకేసులు

దేశంలో కొత్తగా కరోనా కేసులు అంతగా నమోదు కావడం లేదు. తాజాగా 15 వందలకు దిగొచ్చి ఊరట నిస్తున్నాయి. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం 3.57 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 1569 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందు రోజు కంటే 600 మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజివిటీ రేటు 0.44 శాతానికి చేరింది. ఇటీవల కాలంలో రోజు వారీ కేసులు మూడువేల ఎగువకు చేరి ఆందోళన కలిగించాయి. నాలుగో వేవ్‌ గూర్చి వార్తలు వచ్చాయి కాని కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement