Thursday, April 25, 2024

కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్ ను చంపిన యువతి

కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్ ను యువతి చంపిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ యువతి.. తన కొత్త ప్రియుడితో కలిసి మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను చంపేసింది. మాజీ ప్రియుడు రవికుమార్‌ను యువతీయువకులు రాయితో కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరిని బిజినేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement