Friday, March 29, 2024

దుషపాటి లొద్ది జలపాతంలో యువకుడి గల్లంతు

వాజేడు, ప్రభన్యూస్‌: ములుగు జిల్లా వాజేడు మండలం కుంగాల పంచాయతీ పరిధిలోని దుషపాటి లొద్ది జలపాతంలో యువకుడు గల్లంతయిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి తెలిపిన కథనం ప్రకారం.. ఖిలావరంగల్‌ మండలం సాంబపల్లి గ్రామం వరంగల్‌ జిల్లాకు చెందిన జిల్లారపు రాకేష్‌(23) అనే యువకుడు ఏడుగురు స్నేహితులతో కలిసి వాజేడు మండలం కొంగాల దుషపాటిలో లోది జలపాతాన్ని సందర్శించారు. ప్రమాదవశాత్తు యువకుడు జలపాతం లోయలో పడిపోయి గల్లంతయ్యాడు.

ఈ సంఘటన తెలుసుకున్న వాజేడు పోలీసులు ఎస్సై తిరుపతి రావు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో జలపాతం లోయలో గాలించ్చినప్పటికీ మృతదేహం ఆచూకీ కానరాలేదు. దీంతో రాకేష్‌తో వచ్చినటువంటి ఏడుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తిరుపతి రావు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement