Friday, March 29, 2024

Breaking | పవన్​ కాన్వాయ్​ని ఫాలో అవుతూ.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

వెల్గటూర్, (ప్రభ న్యూస్) : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట సమీపంలో రాష్ట్రరహదారిపై మంగళవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్​ మొక్కట్రావుపేటకు చెందిన కూస రాజ్ కుమార్ చనిపోయాడు. మరో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి . మొక్కట్రావుపేటకు చెందిన కూస రాజ్​కుమార్, కుమ్మరిపల్లెకు చెందిన జక్కుల అంజి.. దర్మపురి నుండి వస్తున్న జనసేన అదినేత పవణ్ కల్యాణ్ కాన్వాయ్​ని ఫాలో అవుతూ బైక్ పై వస్తున్నారు. కాగా, కాన్వాయ్ దాటేందుకు రోడ్డు పక్కనుండి వెళుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టారు. ఆ తర్వాత మరో కార్ ను ఢీకొట్టడంతో రాజకుమార్ అక్కడికక్కడే చనిపోయాడు.

కిషన్​రావుపేటకు చెందిన బావ బావమరుదులు పొలిశెట్టి శ్రీనివాస్ , నీలం సాగర్ కు తీవ్రగాయాలయ్యాయి . శ్రీనివాస్ వెల్గటూర్ తహసీల్దార్​ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా, సాగర్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. మృతుడి బైకుపై ఉన్న మరో యువకుడు జక్కుల అంజికి గాయాలయ్యాయి . మృతుడు రాజకుమార్ పవణ్ కల్యాణ్ వీరాభిమానిగా తెలిసింది. కాన్వాయ్ వెంట బైకుపై జై కొడుతూ వెళ్లినట్టు చూసిన వారు చెబుతున్నారు . తీవ్రగాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement