Saturday, April 20, 2024

బెంగళూరులో అమానుషం.. వ్యక్తిని ఢీకొట్టి కారుతో ఈడ్చుకెళ్లిన మహిళ

ఒక వ్యక్తితో గొడవ పడిన మహిళ ఆగ్రహంతో అతడ్ని కారు బానెట్‌పై ప్రమాదకరంగా కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్‌ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రియాంక అనే మహిళ కారు.. దర్శన్‌ అనే వ్యక్తి కారును ఢీకొట్టింది. దీనికి సంబంధించి అతడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే కారు నుంచి దిగిన వ్యక్తి.. ఆ మహిళ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఆమె స్పీడ్‌ పెంచి అతడిని ఢీకొట్టడంతో బానెట్‌పైకి దూకేశాడు.

ఈ క్రమంలోనే ప్రియాంక అతడిని అలాగే కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లింది. మరోవైపు, రద్దీ రహదారిపై వాహనాల్లో వెళ్లే వారు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు బైక్‌ల్లో ఆ కారును అనుసరించి చివరకు దానిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్‌ ఫిర్యాదుతో ప్రియాంకపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆమె ఫిర్యాదుతో దర్శన్‌తోపాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement