Thursday, April 25, 2024

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

విశాఖ జిల్లాలోని భీమిలీ, వల్లాది పేటలో వివాహేత‌ర సంబంధం ఓ వ్య‌క్తి హ‌త్య‌కు కార‌ణ‌మైంది. ప్రియుడి మోజులో ప‌డిన‌ వివాహిత త‌న భ‌ర్త‌నే హ‌త‌మార్చింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. శ్రీ‌నివాస‌రావు, వివాహిత‌ జ్యోతిల మ‌ధ్య కొంత‌కాలం క్రితం ప‌రిచ‌య‌డం ఏర్ప‌డింది. వీరి బంధం బ‌ల‌ప‌డ‌డంతో వీరికి అడ్డుగా ఉన్న భ‌ర్త‌ను హ‌త‌మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ప‌థ‌కం ప్ర‌కారం స్కెచ్ వేశారు. భీమిలీలో ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హత్యచేసి మృతదేహాన్ని కైలాసగిరి సమీపంలో స్మశానవాటికలో దహనం చేసినట్లు సమాచారం. మృతుడు అన్నయ్య భీమిలీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సిఐ లక్ష్మణ్ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement