Thursday, April 25, 2024

మొన్న కారు… ఈ రోజు బైక్ – టార్గెట్ అంబానీ ?

ముంబై లోని ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలున్న స్కార్పియో ఎస్‌యూవీ పట్టుబడిన కేసులో విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు అంబానీ ఇంటి వద్ద అనుమానాస్పద ఓ బైక్ కనిపించింది. పేలుడు పదార్థాల కేసు దర్యాప్తులో ఉన్న సమయంలోనే అదే ప్రాంతంలో ఇప్పుడు బైక్ పార్క్ చేసి ఉండటం కలకలం రేపుతోంది. మరోవైపు ఈ బైక్ వివరాలు RTA అధికారుల వద్ద లేకపోవడం ఇంకా అనుమానాలకు దారి తీస్తుంది.

గతంలో స్కార్పియో పార్క్ చేసిన ప్రదేశంలోనే.. ఈ బైక్ పార్క్ చేసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై గవ్ దేవీ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక పోలీసులు ఈ ఘటనపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement