Thursday, April 18, 2024

టీచర్‌ను చూసి విజిలేసిన విద్యార్థి.. ఆ తర్వాత దబిడిదిబిడే

హర్యానాలో వింత ఘటన చోటుచేసుకుంది. త‌ర‌గ‌తి గ‌దిలోకి ప్ర‌వేశించిన ఓ టీచ‌ర్‌ను చూసి బ్యాక్ బెంచ్‌లో ఉన్న ఓ స్టూడెంట్ విజిలేశాడు. ఆ విద్యార్థి విజిల్‌ మిగ‌తా విద్యార్థుల‌పై కూడా తీవ్ర ప్ర‌భావాన్ని చూపింది. విజిల్‌తో కోపగించుకున్న టీచ‌ర్‌తో పాటు మ‌రో ఇద్ద‌రు క‌లిసి మిగ‌తా 40 మంది విద్యార్థుల‌ను దారుణంగా క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. ఈ ఘటన తోహ‌నా గ‌వ‌ర్న‌మెంట్ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్‌లో సెప్టెంబ‌ర్ 6న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

‘ఈనెల 6న ఉద‌యం పూట క్లాసులోకి ఓ టీచ‌ర్ వ‌చ్చింది. ఆ టీచ‌ర్‌ను చూడ‌గానే వెనుక బెంచ్‌లో ఉన్న ఓ విద్యార్థి విజిలేశాడు. ఆ టీచ‌ర్‌తో కోపంతో ఊగిపోయింది. క్లాస్ రూంలో ఉన్న 40 మందిని పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోకి పిలిపించింది. మ‌రో ఇద్ద‌రు టీచ‌ర్ల‌తో క‌లిసి వారిని క‌ర్ర‌ల‌తో దారుణంగా కొట్టారు. కొంద‌రికైతే ర‌క్తం వ‌చ్చింది. శ‌రీరం వాచిపోయింది. న‌డుముతో పాటు ఇత‌ర శ‌రీర భాగాల‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు క‌ర్ర‌ల‌తో బాద‌డంతో న‌డ‌వ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 10 మంది విద్యార్థులు తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో ఆస్ప‌త్రిలో చేరారు’ అంటూ ప్రీత్‌పాల్ సింగ్ తెలిపాడు. కాగా త‌మ పిల్ల‌ల‌ను దారుణంగా కొట్టిన టీచ‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బాధిత విద్యార్థుల త‌ల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విచార‌ణ అనంత‌రం టీచ‌ర్ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. ఐదు రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని పోలీసుల‌కు స్థానిక ఎస్పీ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement