Wednesday, April 24, 2024

క్లాస్ మెట్ ని చీరలో చూడాలని ఉందంటూ మోడీకి ట్వీట్ చేసిన స్టూడెంట్

కరోనా కారణంగా అన్ని రకాల పరీక్షలు కూడా వాయిదా పడుతున్నాయి. మరికొన్ని పరీక్షలు ఏకంగా రద్దు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఓ విద్యార్థికి మాత్రం విచిత్రమైన కోరిక పుట్టింది.

12వ తరగతి ముగించుకుని స్కూల్ నుంచి బయటకు వెళ్లే తమకు ఫేర్ వెల్ పార్టీ లేదని బాధతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కే ట్వీట్ చేశాడు. సార్.. ఫేర్ వెల్ అయినా చేసుకోనివ్వండి. ఆ 12వ తరగతి బి సెక్షన్ నేహాను చీరలో చూడాలని ఉంది ట్వీట్ పెట్టాడు ఓ విద్యార్థి. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement