Wednesday, April 24, 2024

కరీంనగర్ లో వీఆర్ఏల సంబురాలు.. స్వీట్ల పంపిణీ

ప్రభుత్వ ఉద్యోగులకు స్వర్గధామంగా మారిన తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను సైతం రెగ్యులరైజ్ చేస్తూ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది తెలంగాణ. మొన్న విద్యుత్ ఉద్యోగులు, నిన్న కాంట్రాక్టు లెక్చరర్ల తర్వాత నేడు వీఆర్ఏలను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీఆర్ఏలు మంత్రి గంగుల కమలాకర్​ని కరీంనగర్ లో సన్మానించారు. సీఎం కెసిఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 23000మందికి , కరీంనగర్ జిల్లాలో 700 మంది లబ్ది పొందుతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement