Wednesday, March 27, 2024

కేసీఆర్ గారు వింటున్నారా ఈ టీచర్ ఆవేదన!

కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతో మంది ప్రైవేటు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఉపాధి లేక పస్తులు ఉంటున్నారు. కాగా తాజాగా జగిత్యాల కు చెందిన గడప చంద్ర శేఖర్ అనే ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు మా కుటుంబం ఆత్మహత్య చేసుకోకుండా కాపాడండి కెసిఆర్ గారు అంటూ మీడియా ముందుకు వచ్చాడు. 20 సంవత్సరాలుగా అరకొర జీతాలతో ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాను. జీతాలు లేకపోవడంతో అప్పులు చేశాము. అప్పుల వాళ్ళు ఇంటి పైకి వస్తున్నారు. నెలసరి కట్టే ఈఎంఐలు సైతం కట్టలేకపోతున్నాము.

ఉండటానికి ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాము. ప్రైవేటు టీచర్ గా పని చేయడమే మేము చేసిన తప్పా కేసీఆర్ గారు… నా కూతురు ఇంటర్ వరకు చదివింది. డిగ్రీ చదవడానికి డబ్బులు లేవు. అలాగే నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. ఆసుపత్రిలో చూపించేందుకు డబ్బులు లేవు. నా భార్య పిల్లలకు రెండు పూటలా కడుపు నిండా భోజనం కూడా పెట్టలేక పోతున్నాను. నా కుటుంబం ఆత్మహత్య చేసుకోక ముందే మమ్మల్ని కాపాడండి సార్ అంటూ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement