బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పాటు గురించి వస్తున్న ఊహాగానాలకు త్వరలో తెరపడనుంది. ఈ నెలాఖరులోగా కమిటీ పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త సెలెక్షన్ కమిటీ ఏర్పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా మండలి కొత్త సెలెక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక చేయనుంది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరంజపే, సులక్షణ నాయక్లు ముంబైలోని బీసీసీఐ ఆఫీసులో డిసెంబర్ 30 వ తేదీన సమావేశం కానున్నారు. బీసీసీఐ అధికారులతో చర్చించి సెలెక్షన్ కమిటీ సభ్యులకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంపికైన వాళ్ల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది.
2011 తర్వాత ఒక్క మెగా టోర్నీ కూడా టీమిండియా విజేతగా నిలవలేదు. దాంతో స్వదేశంలో జరిగే ప్రపంచకప్ ట్రోఫీపై భారత జట్టు కన్నేసింది. ఈ నేపథ్యంలో సెలెక్షన్ కమిటీ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన ఆసియా కప్లో భారత జట్టు చెత్త ప్రదర్శనతో ఇంటి దారి పట్టింది. టీ 20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం జట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో చేతన్ శర్మ కమిటీని రద్దు చేయాలనే డిమాండ్లు వచ్చాయి. సెలెక్షన్ కమిటీపై నవంబర్లో బీసీసీఐ వేటు వేసింది. ఆ వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే వాళ్లకు ఉండాల్సిన అర్హతలను నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే వాళ్లకు ఉండాల్సిన అర్హతలను బీసీసీఐ స్పష్టంగా నోటిఫికేషన్లో వెల్లడించింది.