Saturday, April 20, 2024

బ్లాక్ ఫంగస్ తో కడప జిల్లావాసి మృతి

బ్లాక్ ఫంగస్ వ్యాప్తి క్రమేణా ఎక్కువవుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారు దీని బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇటీవల తెలంగాణలో కూడా ఈ కేసులు నమోదు అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఓ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించినప్పటికీ… అధికారికంగా నిర్ధారించలేదు. తాజాగా కడప జిల్లాకు చెందిన వంశి అనే వ్యక్తి ఈ బ్లాక్ ఫంగస్ బారినపడి కాచిగూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇక మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 12 కేసులు ఇప్పటివరకు నమోదయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా బాధితులు ఐసీయూలో ఉండటం ఆక్సిజన్, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధికి బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement