Friday, March 29, 2024

కృష్ణా జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ఒక‌రు మృతి.. మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం..

కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం ఉమామహేశ్వరపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి… హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొన్న ఘ‌ట‌న‌లో ఓ వృద్దురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వ్య‌క్తి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. స్థానికుల స‌హాయంతో వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో మొత్తం ఐదుమంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరు కాకినాడకు వెళుతున్నారు. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలుసుకున్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement