Thursday, April 25, 2024

పుట్టా మధు భార్య పై కేసు….వామన్ రావు దంపతుల హత్య కేసులో కొత్త కోణం

మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు భార్య మంథని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ పై కేసు నమోదైంది. న్యాయవాది దంపతులు వామనరావు హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను తో వీడియో కాల్ మాట్లాడించారని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఈ నెల 19న బిట్టు శ్రీను మంథని కోర్టుకు తీసుకువచ్చారు అక్కడికి వచ్చిన శైలజా తాను చెప్పిన వినకుండా వీడియో కాల్ మాట్లాడించారని ఆయన పేర్కొన్నారు.

కాగా తెలుగు రాష్ట్రాలలో హైకోర్టు లాయర్ దంపతులు వామన్ రావు నాగమణి హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గతంలో ఈ హత్య వెనుక టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఉన్నాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ కేసులో తనకు సంబంధం లేదని ఆయన ఖండించారు. ఇటువంటి సమయంలో పుట్టా మధు భార్య పై కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement