Wednesday, April 24, 2024

కారుపై విరిగిప‌డిన చెట్టు… మ‌హిళ మృతి

ఉన్నట్టుండి కారుపై చెట్టు కూల‌డంతో ఆ కారును డ్రైవింగ్ చేస్తున్న‌ మ‌హిళ మరణించింది. ఈ ఘ‌ట‌న తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. నిన్న చెన్నైలో భారీగా వర్షం కురిసింది. 57 ఏళ్ల మ‌హిళ తన కారులో ఆఫీస్‌ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నది. ఆ కారును ఆమె డ్రైవ్‌ చేస్తుండగా అందులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. కాగా, ఆ కారు కేకే నగర్‌ ప్రాంతంలోకి రాగానే నడుస్తున్న కారుపై ఉన్నట్టుండి రోడ్డు పక్కగా ఉన్న ఒక చెట్టు కూలింది. దీంతో డ్రైవింగ్‌ సీటులో ఉన్న మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ఆ కారులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. చెన్నైలో గ‌త మూడు రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్ర‌ధాన న‌గ‌రాల‌తోపాటు, కూడ‌ల్ల‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement