Tuesday, March 26, 2024

నాగాలాండ్‌ జైలు నుంచి 9 మంది ఖైదీలు పరారీ

నాగాలాండ్‌ జైలు నుంచి 9 మంది ఖైదీలు తప్పించుకున్నారు. పరారైన వారిలో అండర్‌ ట్రయల్‌ ఖైదీలు, హత్యానేరం మోపబడిన వారున్నారు. సెల్‌ కీ ని దొంగిలించిన వీరు నిన్న (శనివారం0 తెల్లవారు జామున జైలు నుంచి పారిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిని గుర్తించేందుకు పోలీసులు, జైలు అధికారులు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. మోన్‌ జిల్లా జైలు నుంచి కనీసం తొమ్మిది మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు.

వీరిని పట్టుకునేందుకు పది బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి సోమ పోలీస్‌ స్టేషన్‌లో జైలు అధికారులు కేసు నమోదు చేశారు. పారిపోయిన వారిని తిరిగి పట్టుకునేందుకు వివిధ ఏజెన్సీల సహకారం తీసుకుంటున్న పోలీసులు.. లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. పరారీలో ఉన్న ఈ ఖైదీలకు సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తే పోలీసులను సంప్రదించాలని ఖైదీల సొంతూళ్ల గ్రామ సభలకు అధికారులు సూచించారు. ———————

Advertisement

తాజా వార్తలు

Advertisement