Saturday, April 20, 2024

పెళ్లి తెచ్చిన తంటా.. 86 మందికి కరోనా

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఓ వివాహం వల్ల 86 మంది కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వం హెచ్చరికలను పెడచెవిన పెట్టి వందలమందితో కొందరు శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో కరోనా కలకలం రేగింది. ఇటీవలే ఆ గ్రామంలో ఓ వివాహం జరిగింది. ఈ వివాహానికి వందలాది మంది హాజరయ్యారు. దీంతో వివాహానికి హాజరైన వారిలో 370 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 86 మందికి కరోనా పాజిటివ్ తేలినట్లు నిర్ధారణ అయ్యింది. ఆదివారం నాడు మరికొంతమందికి కరోనా టెస్టులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సిద్దాపూర్‌లో ఆరోగ్యశాఖ అధికారులు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి టెస్టులు నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement