Thursday, March 28, 2024

మంటల్లో కోళ్లఫాం.. 8500 కోళ్లు కాలి బూడిదయ్యాయి

తమిళనాడులోని ఓ కోళ్ల ఫాం మొత్తం మంటల్లో కాలిబూడిదయ్యింది. ఈ ఘటన నిన్న రాత్రి జరిగినట్టు పోలీసులు తెలిపారు. కోయంబత్తూరు నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నూర్‌లోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 8500 కోళ్లు దగ్ధమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. పౌల్ట్రీ ఫారంలో శనివారం రాత్రి 8 గంటలకు మంటలు చెలరేగాయి. ఆంబోతి గ్రామానికి చెందిన గణేష్‌కు చెందిన భూమిలో ఈ ఫౌల్ట్రీ ఫాం ఉంది.

ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్ టీమ్ రెండు గంటల్లో మంటలను ఆర్పేశాయి. అయినా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిప్రమాదంలో వివిధ పరికరాలు, చికెన్‌ ఫీడ్‌లు కూడా కాలిపోయాయి. 12 లక్షల నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement