Saturday, April 20, 2024

విషాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

గ్యాస్ సిలిండర్​ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన గుజరాత్​లోని అహ్మదాబాద్ లో జరిగింది. మృతులంతా మధ్యప్రదేశ్​కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ నుంచి గుజరాత్​ వచ్చిన కూలీలు.. స్థానికంగా ఉన్న ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివ్​​రాజ్​ సింగ్​ చౌహాన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement