Friday, March 29, 2024

ఏపీలో కొత్తగా 6341 కరోనా కేసులు…57 మంది మృతి

ఏపీలో కరోనా తీవ్రత అదే స్థాయిలో కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24గంట‌ల్లో మొత్తం 1,07,764 మందికి ప‌రీక్ష‌లు చేయ‌గా 6,341 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరోవైపు కొత్త‌గా గడిచిన 24 గంటల్లో 57మంది మరణించారు. అలాగే గడిచిన 24 గంటల్లో 8,486 మంది బాధితులు వైర‌స్ నుంచి కోలుకున్నారు.

ఇక ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 67,629కి చేరుకుంది.
తాజా గణాంకాల ప్రకారం ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,39,243 కి చేరుకుంది. అలాగే డిశ్చార్జ్ కేసుల సంఖ్య 17,59,390కి పెరిగింది. ఇక మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 12,224 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement