Saturday, April 20, 2024

చిత్తూరు జిల్లాలో 60 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం

దివంగత సీఎం వైఎస్ఆర్ 12వ వర్ధంతిని గురువారం నాడు ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వీరాభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని పలమనేరులో 60 అడుగుల భారీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాల్లో ఇదే ఎత్తయినది కావడం విశేషం.

చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ విగ్రహం ఏర్పాటు చేయడంపై రెండు రాష్ట్రాల్లోని వైఎస్ఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: పక్షవాతం వచ్చిన రోగికి బుల్లెట్ బండి సాంగ్‌తో ట్రీట్‌మెంట్

Advertisement

తాజా వార్తలు

Advertisement