Friday, March 29, 2024

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బెంగుళూరు-మదనపల్లి రాష్ట్ర రహదారి చింతామణి తాలూకాలోని మారినాయనహళ్లి గేట్ దగ్గర ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో, ముగ్గురు మహిళలు సహా 4 మంది పిల్లలు జీపులో ప్రయాణిస్తుండగా, అతివేగంగా సిమెంట్ ట్రక్కు జీపును ఢీకొట్టింది. ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించగా జీపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది శ్రీనివాసపూర్ తాలూకాలోని రాయలపాడుకి చెందిన వారుగా గుర్తించారు. మూడు గంటల తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న చిక్కబళ్లాపూర్ ఎస్పీ మిథున్ కుమార్ స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement