Thursday, March 28, 2024

డిప్యూటీ సీఎం తనయుడి కారు ఢీకొని రైతు మృతి

కర్ణాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాడి తనయుడు చిదానంద కారు ఢీకొని ఓ రైతు మరణించాడు. బాగల్‌కోట్ జిల్లా హునగుండలో పొలం నుంచి తిరుగు పయనమైన కుదలెప్ప అనే రైతు బైక్‌ను సవాడి కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన రైతును ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి చిదానంద సవాడి తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు స్థానికులు చెప్పారు.

అయితే తాను తప్పించుకునే ప్రయత్నం చేశానన్న వార్తలను చిదానంద ఖండించారు. తన కారు ఢీకొని 58 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడిన మాట వాస్తవమేనని, కానీ తాను మానవతా దృక్పథంతో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించానని తెలిపారు. దురదృష్టవశాత్తూ అతడు మరణించాడని, అతడి కుటుంబానికి తాను అండగా ఉంటానని చిదానంద స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: పిల్లి చేసిన నిర్వాకంతో కాలి బూడిదైన కరెన్సీ నోట్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement