Thursday, March 28, 2024

ఒకే స్కూల్ లో 55 మంది విద్యార్థులకు కరోనా…బ్రేకింగ్

దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో విద్యార్థులకు కరోన సోకగా… తాజాగా కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం లోని ఓ కార్పొరేట్ స్కూల్లో 55 మంది పిల్లలు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.దీంతో అధికారులు స్కూల్ను మూసివేసి ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఏపీలో నిన్న 1005 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement