Thursday, March 28, 2024

50 వాహనాలు ఢీకొన్న ఘటనలో.. ముగ్గురు మృతి

రహదారిపై దట్టమైన మంచుకారణంగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఏకంగా 50 వాహనాలు ఇలా ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో కొన్నివాహనాల నుంచి మంటలు ఎగసిపడ్డాయి. ఈ సంఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో సోమవారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 20మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కొద్ది గంటలపాటు ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డజనుకుపైగా ఫైరింజన్లు, విపత్తు నిర్వహణ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు.

ప్రమాదానికి గురైన వాహనాల్లో కార్లతో పాటు ట్రాక్టర్‌ ట్రాలీలు, భారీ ట్రక్కులు కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనాలు రహదారిపై అడ్డదిడ్డంగా పడివున్నట్లు డ్రోన్‌ కెమేరా చిత్రాల్లో కనిపించింది. పలువురు వాహనదారులు, డ్రైవర్లు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ప్రాంతంలో నెలరోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండవసారి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement