Thursday, April 25, 2024

న‌గ‌ల షోరూంలో రూ.5 కోట్ల విలువైన ఆభ‌ర‌ణాలు చోరి..

చెన్నై శివారులోని నగల షోరూమ్‌లో పక్కాగా సినిమా స్టైల్లో దొంగలు 10 కిలోల బంగారం, కోటి రూపాయల వజ్రాలు ఎత్తుకెళ్లిపోయారు. వివ‌రాల‌లోకి వెళితే, పెరంబూర్​లోని పేపర్​మిల్స్ రోడ్డులో శ్రీధర్ తన కుటుంబంతో కలిసి రెండస్థుల భవనంలో నివాసం ఉంటున్నాడు.

అదే బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఎనిమిది సంవత్సరాలుగా జేఎల్ గోల్డ్ ప్యాలెస్ పేరుతో బంగారు నగల దుకాణాన్ని నడుపుతున్నాడు. ఎప్పటిలాగే గురువారం రాత్రి నగల దుకాణాన్ని మూసివేశాడు. అయితే శుక్రవారం ఉదయం షాప్ తెరిచేందుకు శ్రీధర్ తన షాపునకు వచ్చి చూసేసరికి షాక్​కు గురయ్యాడు. ఈ షాపు స‌మీపంలోని గుడి వెనుక నుంచి షోరూమ్ దుకాణ షట్టర్​ను గుర్తుతెలియని దుండగులు వెల్డింగు మిషన్​తో కత్తిరించి దోపిడీ చేశారు. భవనంలోని సీసీటీవీ హార్డ్​ డిస్క్​ను కూడా తీసుకువెళ్లిపోయారు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు దొంగ‌ల కోసం వేటాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement