Saturday, April 20, 2024

400 రోజులు.. 4 వేల కి.మీ పాదయాత్ర : నారా లోకేశ్

మంగళగిరి పర్యటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే నెల‌(జ‌న‌వ‌రి) 27వ తేదీ నుంచి పాయ‌దాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు లోకేశ్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాద‌యాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగ‌నుంద‌న్నారు. మంగళగిరి నియోజకర్గంలో తన పాదయాత్ర నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లోకేశ్ చెప్పారు. త‌న‌ను ఓడించేందుకు జ‌గ‌న్ ఎన్ని కుయుక్తులు చేసినా గెలిచేది టీడీపీ నే అన్నారు. వైసీపీ వాడే ఆయుధాలను నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు సైనికుల మాదిరి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీని గెలిపించే బాధ్యతలను తాను భుజాన వేసుకోబోతున్నానని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement