Tuesday, April 23, 2024

సాయంత్రం వేళల్లోనే.. 40 శాతం రోడ్డు ప్రమాదాలు

రోడ్డు ప్రమాదాలపై కేంద్ర ప్రభుత్వం ఓ నివేదికను విడుదల చేసింది. 2021లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషించింది. 40శాతం ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యే జరుగుతున్నట్లు తేల్చింది. వాహనదారులకు ఆ సమయం అత్యంత ప్రమాదకరమని ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సురక్షితమని, ఆ సమయంలో 10 శాతం లోపు ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయని గణాంకాలు వెల్లడించాయి. 2021లో నమోదైన 4.12 లక్షలకు పైబడిన ప్రమాదాల్లో 1.58 లక్షల ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య జరిగాయని భారత్‌లో రోడ్డు ప్రమాదాలు2్ఖ021 పేరిట ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ప్రచురించిన వార్షిక నివేదిక పేర్కొంది.

ఇక సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకూ దేశవ్యాప్తంగా 21 శాతం ప్రమాదాలు జరిగాయని తెలిపింది. 3 నుంచి 6 గంటల మధ్య 18 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2021లో 4996 ప్రమాదాలు ఏ సమయంలో జరిగాయో గుర్తించలేదని ఈ నివేదిక తెలిపింది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య తమిళనాడులో అత్యధికంగా 14,416 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, మధ్యప్రదేశ్‌లో 10,332 ప్రమాదాలు వెలుగుచూశాయని పేర్కొంది. 2017 నుంచి జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటిలో 35 శాతం కంటే అధిక ప్రమాదాలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement