Tuesday, April 23, 2024

రాజంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో రూ.40లక్షల నిధులు గోల్ మాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజంపేట హెడ్ పోస్ట్ ఆఫీస్ లో నిధులు గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తోంది. రూ.40లక్షలు పోస్టల్ అసిస్టెంట్ విష్ణువర్ధన్ మాయం చేశారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వినియోగదారుల ఖాతాల నుంచి సుమారు రూ.40 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా విష్ణువర్ధన్ సహా అతని సోదరుడు హేమంత్ ను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement