Friday, April 19, 2024

తెలంగాణలో కొత్తగా 3614 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అదే స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,614 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే 18 మంది క‌రోనాతో మృతిచెందారు. ఇదే స‌మ‌యంలో 3,961 మంది క‌రోనా నుంచి కొలుకున్నారు. అలాగే ప్ర‌స్తుతం క‌‌రోనా పాజిటివిటీ రేటు 4 శాతం ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 0.5 శాతంగా నమోదు అయ్యింది.

మ‌రోవైపు.. ఆస్ప‌త్రుల్లో చేరే క‌రోనా బాధితుల సంఖ్య కూడా తగ్గుతుంది. 10 రోజుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి ప‌డిపోయింద‌ని.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement