Friday, April 19, 2024

తెలంగాణలో కొత్తగా 3464 కరోనా కేసులు…25 మంది మృతి

తెలంగాణ లో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. కాగా గడిచిన 24 గంట‌లలో కొత్తగా 65,997 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయగా కొత్త‌గా 3,464 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే క‌రోనా కార‌ణంగా కొత్తగా 25 మంది మృతి చెందారు. మరోవైపు క‌రోనా నుంచి 4,801 మంది కొలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం….రాష్ర్టంలో మొత్తం న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 5.47 లక్ష‌లు దాటింది. ఇందులో 5 ల‌క్ష‌ల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 44,395 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే కరోనా కారణంగా మొత్తం 3085 మంది మృతి చెందారు.. తాజాగా న‌మోదైన కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 534 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత రంగారెడ్డి జిల్లాలో 243, మేడ్చ‌ల్ జిల్లాలో 219 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement