Friday, March 29, 2024

శత్రువుల ఆస్తుల ద్వారా కేంద్రానికి రూ.3,400 కోట్లు

దేశంలోని శత్రువుల ఆస్తులను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3400 కోట్లను సమీకరిం చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఇందులో అధికభాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్ల వంటి చరాస్తులేనని తెలిపింది. శత్రువుల ఆస్తుల ద్వారా ఆర్జించిన రూ.3407.98 కోట్లను కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్‌ ఇండియా విడుదల చేసింది. ఇందులో 152కంపెనీలకు చెందిన 7.53 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.2,708 కోట్లు.రూ.699.08 కోట్లు రెవెన్యూ రిసీట్ల రూపంలో ఉన్నాయి. వీటితోపాటు గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా మింట్‌ ద్వారా 2021 జనవరిలో 1699.79 గ్రాముల బంగారాన్ని విక్రయించి రూ.49.14 లక్షలు, 28.89 కిలోల వెండి ఆభరణాల ద్వారా రూ.10.92 లక్షలు ఆర్జించినట్లు కేంద్రహోంశాఖ అధికారి వెల్లడించారు.

అయితే, ఇప్పటి వరకు శత్రువులకు చెందిన ఎలాంటి స్థిరాస్థులను ప్రభుత్వం సొమ్ము చేసుకోలేదని తెలిపారు. మన దేశంలో 12,611 శత్రు ఆస్తులున్నాయి. ఇందులో 12,386 ఆస్తులు పాక్‌ పౌరసత్వం తీసుకున్న వారివి కాగా, మిగతా 126 చైనా జాతీయులవి. అత్యధికంగా యూపీలో 6255 శత్రు ఆస్తులను గుర్తించారు. పశ్చిమబెంగాల్‌లో 4088, ఢిల్లిdలో 659, గోవాలో 295, మహారాష్ట్రలో 208, తెలంగాణలో 158, గుజరాత్‌లో 151, త్రిపురలో 105, మధ్యప్రదేశ్‌ 94, బీహార్‌ 84, చత్తీస్‌గఢ్‌లో 78, హర్యానాలో 71 ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement