Thursday, April 25, 2024

‘ఆదిత్య 369’ చిత్రానికి 30 ఏళ్లు.. స్పెషల్ వీడియో విడుదల

1991, జూలై 18న విడుదలైన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ సంచలన విజయం సాధించింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రేక్ష‌కులకు స‌రికొత్త థ్రిల్‌ అందించారు. బాలకృష్ణ, మోహిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

అయితే ఈ సినిమాకు పునాది పడేందుకు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కారణమని హీరో బాలకృష్ణ వెల్లడించారు. ఓ సంద‌ర్భంలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు త‌న మ‌న‌సులో ఉన్న ట్రైమ్ ట్రావెల్ లైన్ గురించి బాలుకి చెప్పారు. ఎస్పీబీ ఎగ్జయిట్‌ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్‌ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే… ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ‘ఆదిత్య 369’చిత్రాన్ని ఈ రోజుల‌కు కూడా అన్వయించుకునేలా ఉంటుంది. ఈ మూవీ ఇప్పటికీ డిజిటల్ మీడియాలో ఆదరణ పొందుతుండటం గర్వకారణంగా ఉందని బాలయ్య తెలిపారు. త్వరలో‘ఆదిత్య 369’కి సీక్వెల్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: డిసెంబరులో విడుదల కానున్న ‘పుష్ప’

Advertisement

తాజా వార్తలు

Advertisement