Thursday, April 25, 2024

టీచింగ్‌ ఆస్పత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్స్‌.. నియామకపు ఉత్తర్వులు ఇచ్చిన వైద్యారోగ్య శాఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని టీచింగ్‌ ఆస్పత్రులలో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఇవ్వాల (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు టీచింగ్‌ ఆస్పత్రులలో నియమించింది. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో రేడియోగ్రాఫర్స్‌ పోస్టుల భర్తీ కోసం 2017లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనంతరం అర్హులతో కూడిన సెలక్షన్‌ జాబితాను విడుదల చేయగా, ఆయా పోస్టుల్లో తమకు వెయిటేజి ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని కొందరు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు.

దీంతో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. ఆలస్యం కావడం వల్ల అర్హులైన నష్టపోతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రక్రియ త్వరగా పూర్తి అయ్యేలా చొరవ చూపింది. ఈ క్రమంలో కేసును కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో భర్తీకి రేడియోగ్రాఫర్స్‌ నియామకానికి మార్గం సుగమమైంది. టీఎస్‌ పీఎస్సీ సెలక్షన్‌ లిస్ట్‌ విడుదల చేసిన వెంటనే సోమవారం కౌన్సిలింగ్‌ నిర్వహించి వారికి పోస్టింగులు ఇస్తూ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement