Thursday, March 28, 2024

వీడియో: కర్ణాటకలో దారుణం.. 50 కోతులకు విషం పెట్టి గోనెసంచుల్లో కుక్కారు

మనుషుల్లో మానవత్వం కనుమరుగై పోతున్న వేళ… కొందరు దుండగులు మూగజీవాలపై మానవత్వం లేకుండా ప్రవర్తించారు. 50 కోతులకు విషం పెట్టి, గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి. కర్ణాటక-చౌడనహళ్లి గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.

హసన్ జిల్లా బెలూర్ తాలూకా చౌడనహళ్లి సమీపంలోని రోడ్డు పక్కన భారీగా గోనెసంచులు గుర్తించిన కొందరు యువకులు.. వాటిని తెరవగా అందులో కోతులు కన్పించాయి. వీటిలో 30 కోతులు చనిపోగా.. మరికొన్ని అపస్మారక స్థితికి చేరుకున్నాయి. దీంతో గాయాలతో ఉన్న కోతులకు వారు వెంటనే నీరు, ఆహారం అందించగా 20 కోతులు బ్రతికాయి. వీటిలో రెండు కోతుల పరిస్థితి విషమంగా ఉండటంతో వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. కోతులకు విషం పెట్టి సంచుల్లో కుక్కారని, సంచుల పైనుంచి బలంగా కొట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

YouTube video

ఈ వార్త కూడా చదవండి: చైనాలో పెరుగుతున్న డెల్టా వేరియంట్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement