Thursday, April 25, 2024

ఏపీలో కొత్తగా 2591 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మరికాస్త పెరిగింది. తాజాగా గడిచిన 24గంట‌ల్లో కొత్తగా 90,204మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 2,591 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా తో 15మంది మృతి చెందారు. మ‌రోవైపు గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,329మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 19,29,579కి చేరింది. అలాగే ప్రస్తుతం యాక్టివ్ కేసుల 25,957కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 18,90,565కి చేరింది. ఇక మొత్తం మరణాల సంఖ్య 13,057 కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement