Friday, March 29, 2024

ఏపీలో కొత్తగా 2527 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,280 సాంపిల్స్ ని పరీక్షించగా 2,527 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, శ్రీకాకుళం లో ఒక్కరు మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

ఇక గడచిన 24 గంటల్లో 2,412 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.

యాక్టీవ్ కేసుల సంఖ్య…23939
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య…1909613
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య… 1946749
మొత్తం మరణాల సంఖ్య…13197

Advertisement

తాజా వార్తలు

Advertisement