Thursday, April 18, 2024

ఖమ్మం జిల్లాకు రూ.248 కోట్లు

  • సీఎం ఎస్సురెన్స్ కింద ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • ఫలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి

ఖమ్మం : ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానం మేరకు రూ.248 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (SDF) నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకెళ్లారు. అనేక ప్రభుత్వాలు వచ్చినా.. పాలకులు కేవలం రాజకీయ అవసరాలకు వాడుకున్నారే తప్ప జిల్లా అభివృద్ధికి ఏనాడూ నిధులు మంజూరు చేయలేకపోయారు. మంత్రి పువ్వాడ ఖ‌మ్మం నగరాభివృద్ధి తరహాలో జిల్లాను చూడాలనే ఆకాంక్షతో జిల్లాకు నిధులు ఇవ్వాలని అనేక మార్లు కేసీఆర్ కు వినతి పత్రాలు అందించారు. స్పందించిన కేసీఆర్ ఖమ్మం జిల్లాకు రూ.248 కోట్లు మంజూరు చేశారు. ఆయా నిధులకు సంబందించి జీవో వచ్చే వరకు వెంటపడి మరీ జీవోను వచ్చేలా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి చేశారు. జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.50 కోట్లు, అన్ని సత్తుపల్లి, వైరా, మధిర ఒక్కో మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు చొప్పున మొత్తం రూ.90 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున 584 గ్రామ పంచాయతీలకు గాను రూ.58.40 కోట్లు, పెద్దతండా, ఎదులాపురం, కల్లూరు, తల్లాడ, నేలకొండపల్లి గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.50 కోట్లు మొత్తం జిల్లాకు గాను రూ.248.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిన వాగ్దానంను నేడు ఆచరణలో చేసి చూపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థన మేరకు ఆయా నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిగణనలోకి తీసుకుని ప్రకటించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆయా నిధులకు గురువారం ఉత్తర్వులను వెలువడించింది. ఇందుకు తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. అభివృధి నిధులు విడుదల పట్ల జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు సీఎం కేసీఆర్ కు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement