Thursday, April 18, 2024

ప్రాణం తీసిన కల్తీమద్యం.. బీహార్‌లో 24 మంది మృతి

బీహార్‌లో కల్తీ మద్యం తాగి రెండు రోజుల్లో 24 మంది చనిపోయారు.  పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  పశ్చిమ చంపారన్ జిల్లాలోని గోపాల్‌గంజ్‌లో ఈ ఘటన జరిగింది. చంపారన్ జిల్లా తెల్హువా గ్రామంలో నిన్న 8 మంది చనిపోగా, గోపాల్‌గంజ్‌లో 16 మంది మృత్యువాత పడ్డారు. తెల్హువాలో ఇలాంటి ఘటన జరగడం గత 10 రోజుల్లో ఇది మూడోసారి. సమాచారం అందుకున్న వెంటనే గోపాల్‌గంజ్ చేరుకున్న మంత్రి జనక్ రామ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో కల్తీ మద్యంతో ఇంత మంది మృతిచెందడం కలకలం రేపుతోంది.

ఇది కూడా చదవండి: న్యూడ్ కాల్స్ తో వేధింపులు.. అవమానంలో యువతి సూసైడ్

Advertisement

తాజా వార్తలు

Advertisement